E-PAPER

ఆదివాసి ప్రజలపై ప్రభుత్వ దాడులను నిలుపుదల చేయాలి

సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్

చర్ల, డిసెంబర్ 7 వై సెవెన్ న్యూస్;

ఆదివాసి గిరిజన ప్రజల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులను కొనసాగిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాల దాడులను నిలిపివేయాలని శనివారం చర్ల లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుపాకులు నాగేశ్వరరావు లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం,అప్రజా స్వామి కంగా వ్యవహరిస్తుంది. ఆదివాసీలకు జీవనాధారమైన పోడు భూములను ఆక్రమిస్తూ , ప్లాంటేషన్లను పెడుతుంది.కేంద్ర ప్రభుత్వం కాగర్, ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ఆదివాసి గూడాల పైన దేశవ్యాప్తంగా దాడులను కొనసాగిస్తుంది. ముఖ్యంగా చతిస్గడ్ లో వైమానిక దాడులను నిర్వహిస్తుంది.సైనిక బలగాల తోటి స్త్రీలు పురుషులనే తేడా లేకుండా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలను కొనసాగిస్తుంది. ఇవన్నీ ఎందుకు కొనసాగుతున్నాయి ? ఆదివాసి ప్రాంతంలో 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి . ఈ సంపదలన్నింటినీ దోచుకెళ్లడానికి కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం చేయడానికి ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివాసి చట్టాలను సవరించి అటవీ సంరక్షణ నియమాల పేరుతో గిరిజన గుడాలను కాళీ చేపించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లతో పాటు ఏడవ (7) గ్యారెంటీని ఇచ్చింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని, ప్రజల పైన దాడులు జరగకుండా తన ప్రభుత్వం అధికారంలోకొస్తే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని నమ్మబలికారు . అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఆదివాసీల కోసం నిలబడ్డటువంటి , వారి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విప్లవకారులను గత టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే , బూటకపు హత్యలు చేస్తుంది . ప్రజాస్వామ్యాన్ని పాతర పెట్టి రాజహింసను కొనసాగిస్తున్నది. దానికి ఉదాహరణ ఏటూరు నాగారం దగ్గర ఏడుగురిని (7) బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చడమే. తిరిగి పైగా దొంగే దొంగ అన్న చందంగా గిరిజనుల పైన నక్సలైట్లు దాడులు చేస్తున్నారని అమాయక ఆదివాసి గిరిజనుల తోటి ప్రదర్శనలు తీపిస్తున్నారు . ప్రభుత్వ ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ది: 06:12:2024 న చర్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీల తోటి ప్రభుత్వం నిర్వహించిన ర్యాలీలో PYL నాయకులు ముసలి సతీష్ .ఈ ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఇది అవగాహన లేని దాంట్లో నుంచి జరిగిన లోపం. ఈ విషయాన్ని ప్రజలు పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడవ గ్యారెంటీ అమలు చేయడానికి పూనుకోవాలి. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందిగా CPI (M-L) న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి . చర్ల ప్రాంతంలో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఇసుక వ్యాపారాలను నిలుపుదల చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కోసం ప్రజలు న్యూ డెమోక్రసీ నిర్వహించే ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో చర్ల దుమ్ముగూడెం సభ్యులు కార్యదర్శి ముసలి సతీష్,ఏఐటిఎఫ్ నాయకులు ముయన్న,POW నాయకులు సమ్మక్క,గంగ,సుజాత,శ్రవంతి PYL నాయకులు స్వరూప్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News