E-PAPER

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి; మంత్రి సీతక్క

. గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ,పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధ‌నసరి అనసూయ సీతక్క

వై7 న్యూస్‌, ములుగు జిల్లా ప్ర‌తినిధిః- గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల‌ని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం రోజున‌ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తేజ చిల్డ్రన్స్ వైద్యశాలను ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి సీత‌క్క మాట్ల‌డుతూ.. గ్రామీణా ప్రాంత ప్ర‌జ‌లు వ‌ర్ష‌కాల స‌మ‌యంలో సీజ‌న‌ల్ వ్యాదుల భారీన ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌న్నారు. అలాగే గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మైరుగున వైద్యం అందెలా చూడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్సైతాజుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయుబ్,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట మట రఘు, మండల అధ్యక్షులు అప్సర్, జడ్పిటిసి నామకరం చందు గాంధీ, బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగరావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News