E-PAPER

వజ్రపుకొత్తూరులో కస్టమ్ హైరింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, జూన్ 13 (వై7 న్యూస్): వజ్రపుకొత్తూరు మండలంలోని ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు యంత్రాల బ్యాంకు “కస్టమ్ హైరింగ్ సెంటర్” ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు వ్యవసాయ పనులు వేగవంతంగా పూర్తవుతాయని తెలిపారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా తక్కువ అద్దెకు యంత్రాలను వినియోగించుకోవడం ఎంతో ప్రయోజనకరమని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయ యాంత్రీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఇటువంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

అనంతరం కస్టమ్ హైరింగ్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న వివిధ వ్యవసాయ యంత్రాలను పరిశీలించి, వాటి వినియోగ విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, వెలుగు సిబ్బంది, ఎఫ్‌పీఓ ప్రతినిధులు, వజ్రపుకొత్తూరు మండల పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News