E-PAPER

గ్రీవెన్స్ కార్యక్రమానికి 25 వినతులు

వై 7 న్యూస్ పలాస

శనివారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 25 వినతులు అందాయి.

ఈ వినతుల్లో ఇండ్ల స్థలాలు, ఇల్లు మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, స్పౌస్ పెన్షన్లు, రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, మురికి కాలువల ఏర్పాటు, జీరో ఎక్స్టెంట్ పాసుబుక్కుల మంజూరు వంటి వివిధ సమస్యలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కొన్ని సమస్యలపై అక్కడికక్కడే చరవాణి ద్వారా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారం చేయించారు. మిగిలిన వినతులను సంబంధిత శాఖల అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News