గంజాపై ఉక్కుపాదం మోపుతున్న మణుగూరు పోలీసులు
మణుగూరు, మే 30 (ప్రత్యేక ప్రతినిధి)
పంచర్లకు వేసే గమ్ను ముద్దగా పట్టుకుని, గంజా మబ్బులో తేలిపోయే యువత గమ్యం లేకుండా కొట్టుమిట్టాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మత్తుపదార్థాల వినియోగం యువతలో పెరిగిపోతుండటంతో, పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు.
గత అర్ధరాత్రి మణుగూరులోని చేపల మార్కెట్ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సీఐ నాగబాబు నేతృత్వంలోని బృందం, ఆ యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి పంచర్లకు వేసే గమ్ము ట్యూబ్లను స్వాధీనం చేసుకుంది.సీఐ నాగబాబు మాట్లాడుతూ – “యువత మత్తు పదార్థాలకు బానిసకావడాన్ని ఉపేక్షించం. గంజా సరఫరా చేసే వారిపైనా, దాన్ని వినియోగించే వారిపైనా కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.పోలీసు శాఖ ఇప్పటికీ మరికొన్ని నేర శృంఖలాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజలు సహకరించి సమాచారాన్ని అందించాలంటూ అధికారులు కోరుతున్నారు.