నాగార్జునసాగర్ ఎడమ కాలవలో ఇద్దరు యువకుల గల్లంతు..!
మిర్యాలగూడ,జనవరి 02 వై7 న్యూస్ తెలుగు;
నూతన సంవత్సరం మొదటి రోజే విషాద సంఘటన చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతైన విషాద సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో బుధవారం చోటుచేసుకుంది.
రూరల్ పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం ఐలాపురం సమీపంలో సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కార్తీక్ మిశ్రా (24), విజయ్ గోస్వామి (25) ఉన్నారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 121









