E-PAPER

ఏపీలో రేపు,ఎల్లుండు పింఛన్ల తనిఖీ

పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు

కాకినాడ జిల్లా,డిసెంబర్ 08 (వై7 ప్రతినిధి): ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగులు, ఇతర
కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది కూటమి ప్రభుత్వం. ఒక్కో బృందం 40 మంది పింఛన్లను పరిశీలిస్తుందని వెల్లడించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News