మెదక్.నవంబర్ 30 వై సెవెన్ న్యూస్
మెదక్ జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో వాలీబాల్ కోర్ట్ ను ప్రారంబించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూఖాకీ బట్టలతో నిత్యం పని ఒత్తిడిలో పరుగులు తీసే పోలీసులు ఆ పనులు పక్కన పెట్టి ఆటలు ఆడేందుకు మైదానంలో క్రీడలలో పాల్గొనాలని పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. నిత్యం పని ఒత్తిడితో విధులకు హాజరయ్యే పోలీసులకు మానసిక ప్రశాంతత కోసం స్పొర్ట్స్ నిర్వహిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పరితపిస్తున్న పోలీసులకు ఆటల పోటీలు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. పోలీసు సిబ్బందిలో క్రీడలు తమ శారీరక దృఢత్వాన్ని నిర్ధారిస్తాయని పోలీసు సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తాయని అన్నారు. గెలుపు ఓటములు జీవితంలో భాగమేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. అలాగే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్సాహానికి క్రీడలు దోహదపడతాయన్నారు. సమాజంలో పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకమని, పోలీసు ఉద్యోగం అనేది వత్తిడి, శ్రమతో కూడినదని, వత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా దోహదం చేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ శైలేందర్ ,ఏ. ఆర్ ఎస్ ఐ లు. నరేష్ ,మహిపాల్ పాల్గొన్నారు.









