BIG BREAKING ;
ఖమ్మం టూ టౌన్ పరిధిలోని బురహన్పురం, మామిళ్లగూడెం ప్రాంతంలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అనుమానాస్పద మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.
మృతులను కనతల రాము (32), దివ్య (5)గా గుర్తించినట్లు సమాచారం. ఘటనలో మొత్తం కుటుంబం ప్రభావితమైనట్టు తెలుస్తోంది.
ఘటన స్థలానికి చేరుకున్న ఖమ్మం టూ టౌన్ పోలీసులు పరిశీలన చేపట్టారు. అక్కడ రక్తపు ఆనవాళ్లు కనిపించడంతో ఇది హత్యా? ఆత్మహత్యా? అనే అంశంపై స్పష్టత రాలేదు.
మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నెలకొండపల్లి మండలం అనంతనగరం నివాసులైన ఈ కుటుంబానికి చెందిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 984








