వై 7 న్యూస్ పలాస
పలాస మండలంలోని రామకృష్ణపురం గ్రామంలో శనివారం (04.04.2026) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ SI ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI నరసింహమూర్తి తన సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి, గ్రామ జంక్షన్ వద్ద గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నారీ శక్తి, మహిళల సాధికారత, ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపై గ్రామస్తులకు వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు చట్టాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
గ్రామంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు, మహిళలపై జరిగే నేరాల నివారణకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. అత్యవసర సమయంలో 112 హెల్ప్లైన్ను వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, పోలీసుల సూచనలు పాటిస్తామని తెలిపారు.








