హుజూర్ నగర్,సెప్టెంబర్14 వై 7 న్యూస్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 17వ వార్డ్ మటన్ మార్కెట్ ఏరియా లో తెలంగాణ టైగర్స్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఏడు రోజులు పూజ చేసినటువంటి లడ్డు వేలం పాటలో హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి బెల్లంకొండ భార్గవ్ గౌడ్ స్వామి లడ్డూను వేలంపాటలో కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఏడు రోజులు పూజలు అందుకున్న లడ్డును కైవసం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రజలందరూ పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.
Post Views: 158









