E-PAPER

బ్రేకింగ్ న్యూస్;గ్యాంగ్ సినిమా తరహాలో రైడ్ ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ల అరెస్ట్.

– ఖమ్మంలో హల్ చల్ చేసిన ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు.

– ఆహార తనిఖీ అధికారులమంటూ ఖమ్మం నగరంలోని కింగ్ దర్బార్ హోటల్ లో ఆకస్మిక తనిఖీ.

– కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమానిపై ఫైర్..

– ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపాటు..

-బెంబేలిత్తిన హోటల్ యజమాని..

– మీహోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని హైదరాబాద్ నుంచి తమను ఆకస్మిక విచారణ చేయమని చెప్పిన కేటుగాళ్లు.

– విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రెండులక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్.

-;ఖమ్మం జిల్లా కలెక్టర్ సీసీ, జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు తలా యాభైవేలు ఇవ్వాల్సి ఉంటుందన్న ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు.

– అనుమానం వచ్చిన హోటల్ యజమాని స్థానిక ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం.

– తమ శాఖ నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఏమీ లేవని స్పష్టం చేసిన జిల్లా స్థాయి ఆహార తనిఖీ అధికారి కిరణ్ కుమార్..

– కేటుగాళ్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన హోటల్ యజమాని జుబేర్ ఖాన్..

– అందిన సమాచారంతో రంగంలోకి దిగి నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేసిన ఖమ్మం అర్బన్ పోలీసులు..

– అరెస్టయిన నిందితులు గతంలోనూ ఇలాంటి దాడులకు పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు..

– పట్టుబడిన నిందితులు భద్రాధ్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ రావ్, బానోత్ రామస్వామి, సపావత్ యువరాజ్, అజ్మీరా యువరాజ్ సింగ్ గా గుర్తించిన పోలీసులు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News