Y7న్యూస్ తెలుగు, భైంసా;
నిర్మల్ జిల్లా,భైంసా పట్టణంలో డబల్ బెడ్ రూంల గురుంచి గత నిధి 8నెలల నుండి ఏ రాజకీయ నాయకుడు గాని అధికారులు కానీ పట్టించుకోవట్లేదు లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గత ఐదు రోజులుగాడబల్ బెడ్ రూమ్ ల కోసం లబ్ధిదారులు టెంట్ వేసుకొని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకొని సంఘీభావం ప్రకటించిన కొత్తూరు శంకర్ గిరిదార్ జంగమే. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నిరుపేదలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లను ఇప్పటివరకు అప్పగించలేదని డబల్ బెడ్ రూమ్ లకు సంబంధించిన పనులు, మంచినీటి సరఫరా ,డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం లాంటివి ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయని సత్వరమే వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్ప చెప్పాలని కలెక్టర్ కి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో రాము.శిలారం సత్యనారాయణ జగజంపుల రాజు , లబ్ధిదారులు పాల్గొన్నారు.









