E-PAPER

గోదావరి నదిలో విషాదం… చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు మృతి

ఏటపాక, జూలై 18 (వై7 న్యూస్): పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. చేపల వేట కోసం నదిలోకి వెళ్లిన వీరు ప్రమాదవశాత్తు గల్లంతుకాగా, అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో వారి మృతదేహాలను వెలికితీశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు సీఐ వి. కృష్ణ ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ అప్పలరాజు సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మృతి చెందిన వారు గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకె సుశీల, ఊకె లక్ష్మి, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్గా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

మృతదేహాలను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక్కసారిగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News