E-PAPER

మణుగూరులో బస్టాండ్ నిర్మాణం వెంటనే ప్రారంభించాలి: తహసిల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా

మణుగూరు, జూన్ 10 (వై7 న్యూస్):
మణుగూరు పట్టణంలో ప్రతిపాదిత బస్టాండ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో అప్పటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో మణుగూరు బస్టాండ్ నిర్మాణం కోసం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. 2023 సెప్టెంబర్ 9న అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా భూమిపూజ కూడా నిర్వహించినప్పటికీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మణుగూరు అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామని, కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు కొత్తగా ఒక్క అభివృద్ధి పనిని కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. శంకుస్థాపనలతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకు అవసరమైన పనులు చేపట్టడం లేదని ఆరోపించారు.
మణుగూరు బస్టాండ్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీను, ధర్మావత్ నరసింహారావు, షేక్ కరిష్మా, ఎదలపల్లి శారద, వాంకుడోత్ నాగేంద్రబాబు, మూడి తిరుమల, గుండి గౌరీ, గుండి సర్వేశ్వరరావు, కంభంపాటి శ్రీను, బుద్ధుల ప్రసాద్, కట్ట రాజ్‌కుమార్, వనమాల రాంబాబు, గంజి నరేందర్, పైన్నమనేని హేమంతరావు, కుమ్మరికుంట్ల వెంకటసోములు, సూత్రపు నాగభూషణం, పల్లపు శ్రీను, సుతారి వెంకన్న, మూడ్ చందర్, బోయల సృజన, షేక్ గౌసియా, రేగులగడ్డ సుజాత, కలబోయిన సుబ్రమణ్యం, ఉసికెల రమణ, తెప్పలి లక్ష్మి, ఐతరాజు సాయికుమార్, ఆటో గోపి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News