వై 7 న్యూస్ పలాస;
కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ న్యూక్లో మంగళవారం కొన్ని కుక్కలు ఓ బాలుడిపై దాడి చేసి తలకు గాయాలు చేయగా, స్థానికులు వెంటనే పలాస ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి ప్రథమ చికిత్స అందించారు.
స్థానికులు, 31వ వార్డు ప్రాంతంలో కుక్కల సమస్య ఎక్కువగా ఉందని, గతంలో కూడా ఇదే తరహా ఘటనలు జరిగినప్పటికీ, మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోలేదని తెలిపారు. ప్రజలు ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Post Views: 6








