వై 7 న్యూస్ పలాస
వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామ అభివృద్ధి కోసం ఆదివారం పలాసలోని పార్టీ కార్యాలయంలో గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గౌతు శిరీషకు వివరించి పరిష్కరించాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు.
గ్రామ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష అవసరమైన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Post Views: 58









