E-PAPER

పొగాకు ఇతర మాదకద్రవ్యాలను సేవించడం వల్ల వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం

పొగాకు తంబాకు గుట్కా మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పొగాకు మాదకద్రవ్యాలు విక్రయాలకు పాల్పడితే విక్రయించిన వ్యక్తులపై చట్టరీత్యా కఠినంగా శిక్షించబడతారు

వి.రాఘవేంద్రరావు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సాపూర్

డాక్టర్ నవీన్ వైద్యులుప్రభుత్వ ఆసుపత్రి నర్సాపూర్

నర్సాపూర్ మే,31 వై సెవెన్ న్యూస్

జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర, మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి. రాఘవేంద్రరావు, నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ద్వారా ప్రతిజ్ఞను చేయించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ యువతరం పొగాకు గుట్కా పాన్ మసాలా లాంటి పదార్థాలు తీసుకుని ప్రాణాంతక వ్యాధులకు గురి కావద్దని, చెడు వ్యసనాలకు పాల్పడి ప్రాణాంతక వ్యాధులకు గురై యువతీ యువకులు వారి బంగారు భవిష్యత్తు జీవితాలను చేతులారా నాశనం చేసుకోవద్దు అన్నారు,

నర్సాపూర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి. రాఘవేంద్రరావు మాట్లాడుతూ నేటి సమాజంలో యువతీ యువకులు ప్రజలు పొగాకు గుట్కా పాన్ మసాలా తినవద్దని తద్వారా ప్రాణాంతక వ్యాధులు ప్రబలి జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉందన్నారు, పొగాకు గుట్కా పాన్ మసాలా నిషేధిత పూరిత మాదకద్రవ్యాలను అక్రమంగా ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుని శిక్షించబడతారన్నారు, పొగాకు గుట్కా పాన్ మసాలా నిషేధిత మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై నిర్మూలించాలన్నారు, ఈ కార్యక్రమంలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాది సి.హెచ్. స్వరూప రాణి,సీనియర్ న్యాయవాది ఏ.శ్రీనివాస్,జె.న్యాయవాది రవి నాయక్, ఇంద్ర క్రాంతి పథకం నర్సాపూర్ ఏపీఎం ఎం.గౌరీ శంకర్, కె.సంగమేశ్వర్, ఎన్ఆర్ఈజీఎస్ ఏ.పీ.ఓ.అంజిరెడ్డి, నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు తాత్కాలిక సూపర్డెంట్ రమేష్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ టైపిస్టు కం అసిస్టెంట్ టి.అంజయ్య, లీగల్ సర్వీస్ సిబ్బంది కోర్ సిబ్బంది అరుణ, స్టెనో అరుణ, జ్ఞానేశ్వర్, వనజ, మౌనిక,తేజస్విని,శ్రీనివాస్, షేక్ హాజీ పాషా,మమత,సుకన్య, శ్రీకళ పాల్గొనడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :