మణుగూరు, మే 28 (వై 7 న్యూస్):
జడ్పీ హైస్కూల్ సాంబయ్యగూడెంలో 2001–2002 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ఇది సామాజిక స్పృహకు నిదర్శనమని ఆంగ్ల ఉపాధ్యాయుడు డా. షేక్ మీరా హుస్సేన్ ప్రశంసించారు. పూర్వ విద్యార్థులు గురువులకు శాలువాలు కప్పి సన్మానించారు. 24 ఏళ్ల తరువాత జరిగిన ఈ సమావేశం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..
Post Views: 6,805









