E-PAPER

దొంగ పాస్ బుక్ లు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

బాధితుల తరఫున ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేత

తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి డిమాండ్

దమ్మపేట, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట లో తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ ఈ రోజు 07/03/2025 దమ్మపేటలో డిప్యూటీ తాసిల్దార్ వాణి గారికి అమాయకపు ఆదివాసీల పక్షాన కొన్నీ సమస్యలుతో కుడినా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగిందని,దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామానికి చెందిన వాడే బంగారి అనే వ్యక్తి 2008 సం” లో చనిపోవడం జరిగినది,అతను పుట్టు పుర్వం నుండి గొర్రెగుట్ట గ్రామం లో సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఇతర వ్యక్తులు 2021 లో కుటుంబ సభ్యులకు తెలియకుండా దొంగ పట్టా పాస్ బుక్ తయారు చేయించుకోవడం జరిగినదని,పలు మార్లు దమ్మపేట మండల కార్యాలయం లో MRO లు గా పని చెసిన ఎం.ఆర్.ఓ కు పట్టించుకుపోగ,కొత్తగూడెం కలెక్టరేట్ గ్రీవెన్స్ డే కుడా కలెక్టర్ కి విన్నవించుకున్నా ఎలాంటి స్పoధన రాలేధు అని భాధితులు వాపోయారు.దమ్మపేట ఎంఆర్ఓ కార్యాలయం కేంద్రం గా కొంధరు దొంగ పట్టా పాస్ బుక్ లు తయారు చేయడానికి పాల్పడే వ్యకులపై మరియు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందనీ,అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ,ఎస్టీలు వారి భూములను మీ పేరు మీధ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరారు,కొందరు వ్యక్తులు కొందరు అధికారులతో కుమ్మక్కై దొంగ పట్టా పాస్ బుక్ లు తయారు చేసినట్టు తెలిసిందని,ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి దొడ్డిదారిన పాస్ బుక్కులు తయారి కొనసాగిస్తున్నారో వారిని గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని,భాధితులకు న్యాయం జరగాలంటే సమగ్రమైన సర్వే నిర్వాహించి,పూర్తి స్థాయి లో లోతైన విచారణ జరిపి భాధితులకు న్యాయం చేయాలి అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్,కొలికపోగు కాంతారావు, భూషణం,వాడే.లక్ష్మి,వాడే కన్నమ్మ ,వాడే చిన్నలక్ష్మి,వాడే వీరవెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్