హైదరాబాద్ ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;
రాష్ట్రంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన నాలుగు మొబైల్ టవర్లు, ఇతర ప్రతిపాదనలు పరిశీలించారు.
కవాల్ టైగర్ రిజర్వు యొక్క బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలకిఆమోదంతెలిపారు.
బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ సెల్ ఫోన్ టవర్లు అంశంలో ఈ ఐదు ప్రతిపాదనపై ఎస్బీడబ్ల్యూఎల్ సమావేశంలో చర్చ జరిగింది.గిరిజనుల తరలింపు ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకొని వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తే… 1/70 కింద కల్గే ప్రయోజిత ప్రాంతాలకు తరలిoచాలని సూచన చేశారు.అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణాలను రక్షించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో మంత్రి కొండ సురేఖ, పినపాక శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ,బోర్డు సభ్యులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.









