E-PAPER

అడ్డగోలుగా వాహనాలు నిలిపితే ఊరుకోం: సీఐ సతీష్

మణుగూరు ఫిబ్రవరి24 వై 7 న్యూస్;

రోడ్డుపై అడ్డగోలుగా వాహనాలు నిలిపితే ఊరుకోమని వాహనదారులను సిఐ సతీష్ హెచ్చరించారు.ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా నిలిపి ఉంచిన వాహనాలను స్టేషన్ కి తరలించారు. వాహనాలు నిలిపే ప్రదేశంలో ఆకుకూరలు అమ్మే వృద్ధురాలిని మార్కెట్ కి ఆటోలో పంపించేసి రోడ్డుపై వ్యాపారం చేస్తే వాహనాలు ఎక్కడ నిలుపుతారు అంటూ మందలించారు. లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని సూచించారు. మైనర్ లకు మోటార్ సైకిళ్ళు ఇవ్వొద్దని ట్రిబుల్ రైడింగ్ చేయరాదని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్