E-PAPER

సింగరేణి డే న వెల్లువెత్తిన నిరసనల శగ..!

సింగరేణి యాజమాన్యం స్పందించకుంటే మరో పోరాటానికి సైతం సిద్ధం

దూలం శ్రీనివాస్,సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు

మందమర్రి,డిసెంబర్ 23 వై 7 న్యూస్;
సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం వివక్షను వీడాలని, చేసిన అగ్రిమెంట్ అంశాలను అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిసెంబర్ 23 సింగరేణి డే ఉత్సవాల సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నేడు మందమర్రి లో అన్ని విభాగాలలో కాంట్రాక్టు కార్మికులు నిరసన బ్యాడ్జిలను ధరించి విధులను నిర్వహిస్తూ, నిరసన చేయడంలో విజయవంతంగా కార్మిక వర్గం కదిలింది. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ ఎస్సీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం అనే నిదానదంతో సింగరేణి యాజమాన్యం సంస్థను ముందుకు నడుపుతుంది. కానీ వాస్తవంగా సింగరేణిలో అధికారుల కుటుంబం వేరు, పర్మినెంట్ కార్మికుల కుటుంబం వేరు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబం వేరు లాగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. కాంట్రాక్టు కార్మికులంటే బానిసలుగా, రెండవ తరగతి పౌరులుగా అడుగడుగునా వివక్షతని చూపిస్తుంది. కోల్ ఇండియా వేతనాలు అమలులో, కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించడంలో, క్యాంటీన్ సౌకర్యం ఇప్పించడంలో, పండగ, జాతీయ సెలవులు అమలులో, వృత్తి పన్ను మినహాయింపులు, ఖాళీ క్వార్టర్లు ఇప్పించడంలో, కేటగిరి ఆధారంగా వేతనాలు ఇవ్వడంలో, మైన్స్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, ఇతర చట్టాల అమలు, స్వీట్స్ పంపిణీలో, వేతనాలను సకాలంలో చెల్లించడంలో, ఇలా ప్రతి విషయంలో కాంట్రాక్టు కార్మికుల పైన యాజమాన్యం వివక్షను, నిర్లక్ష్యమే ప్రదర్శిస్తుంది. ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. ఇలా అడుగడుగునా కాంట్రాక్టు కార్మికులపై సింగరేణి యాజమాన్యం వివక్షను, నిర్లక్ష్యాన్ని పాటిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం కాంట్రాక్టు కార్మికుల విషయంలో సానుకూలంగా ఉన్నామంటూనే, తీయటి మాటలు చెబుతూ, వారి వేతనాలు పెంచే విషయంలో వారి, సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23వ తేదీన సింగరేణి వ్యాప్తంగా సింగరేణి డే సందర్భంగా నల్ల బ్యాడ్జీలు నిరసన డిమాండ్ల బ్యాడ్జీలతో కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలియజేయాలని ఇచ్చిన పిలుపుకు చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఆలోచించి నిరసనలను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న అన్ని విభాగాల కార్మిక వర్గానికి కాంట్రాక్టు కార్మిక సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికుల విషయంలో స్పందించి, సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు రావాలని, లేని యెడల మరో మహత్తర పోరాటానికి సైతం కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్