E-PAPER

దేశ వ్యవస్థీకృత లో ఈ బ్యాంకులే కీలకం

అమరావతి,నవంబర్14 వై 7 న్యూస్ ప్రతినిధి :

బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు అత్యంత కీలకమని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ఈ బ్యాంకులను దేశంలో వ్యవస్థీకృతంగా అత్యంత కీలక బ్యాంకులుగా (డీ-ఎస్‌ఐబీ) వర్గీకరించిందని అర్బీఐ పేర్కొంది. దీనికి సంబంధించి బుధవారం ఒక జాబితా విడుదల చేసింది. కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఈ బ్యాంకులు కామన్‌ ఈక్విటీ టైర్‌ 1 (సీఈటీ1) కంటే అధిక మూలధన నిల్వలు కలిగి ఉండాలి. తాజా వర్గీకరణ ప్రకారం ఎస్‌బీఐని బకెట్‌ 4లో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును బకెట్‌ 2లో, ఐసీఐసీఐ బ్యాంకును బకెట్‌ 1లో ఆర్‌బీఐ చేర్చింది.
దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐ తన సీఈటీ 1 కంటే 0.80 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 0.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.20 శాతం అధిక మూలధన నిల్వలు కలిగి ఉండాలి. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించాక ఈ వర్గీకరణ చేసినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్