పినపాక,నవంబర్12 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పర్యటనలో భాగంగా భూపాలపట్నంలో సామాజిక,ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ,కుల, కుటుంబ ఇంటింటా సర్వే ను సమీక్షించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరు కూడా సర్వే చేసే అధికారులకు సహకరించి మీ యొక్క పూర్తి వివరాలను అధికారులకు తెలియజేయాలని ఈ యొక్క సర్వే ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతుందని ప్రతి ఒక్కరు సర్వే జరిగే సమయంలో ఇంటి యజమాని పూర్తి కుటుంబ వివరాలను తెలియజేయాలని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ , ఎం పి డి ఓ రాఘవరపు రామకృష్ణ ,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిశాల రామనాథం , కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు