అశ్వాపురం,అక్టోబర్02; వై 7న్యూస్
అశ్వాపురం మండల కాంగ్రెస్ ఆఫీసు ఓరుగంటి వీరయ్య భవన్ నందు మండల కాంగ్రెస్ ఆద్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య అధ్యక్షతన బుధవారం మహాత్మా గాంధీ 155 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మహనీయుని స్మరించుకుంటూ, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన అవలంభించిన శాంతి, అహింసా మార్గాలు నేటి యువత కు కూడా మార్గదర్శకాలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, బట్టా సత్యనారాయణ, తూము వీరరాఘవులు, చంచల రాము, ఆవుల రవి, సొందే రమేష్, మోసేన్, ఎల్లబోయిన కుమార్, షారుక్ పాషా, భూక్యా కాళిదాసు, విజయ్, మాదినేని నరసింహా రావు తదితులు పాల్గొన్నారు.
Post Views: 134









