దుమ్ముగూడెం, జూలై 03 ( వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంధ్ర కేసరి నగర్ కాలనీలో నిర్వహించిన ఓటర్ SIR కార్యక్రమంలో భాగంగా ఓటర్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా దుమ్ముగూడెం బీఎల్ఓ మాలోతు నరేష్ ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకుని నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.
Post Views: 18








