వై7 న్యూస్ పలాస:
పలాస రైల్వే స్టేషన్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద కాశీబుగ్గ పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారు తీసుకువచ్చిన లగేజ్ బ్యాగ్ లో 8 కిలోల గంజాయి పట్టుబడినట్లు సీ ఐ వై రామకృష్ణ మీడియాకు తెలిపారు.
అనుమానితులు ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు, ఈ గంజాయిని మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు విచారణలో బయటపడ్డారు. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 15








