తూప్రాన్ న్యూస్ జనవరి 22
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ పట్టణంలోని డైలీ మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు రోడ్డు భద్రత నియమాల గురించి తూప్రాన్ ఎస్ఐ గంగరాజు మహిళా ఎస్సై జ్యోతి పోలీసు సిబ్బంది తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కూరగాయలకు సంబంధించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క సరకులను సురక్షితంగా గమ్య స్థానాలకు రవాణా చేసుకోవడం విషయం గురించి అలాగే ప్రతీ వాహనదారులు హెల్మెట్ సీటు బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి సురక్షితంగా గమ్యం చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వాహనదారులు తూప్రాన్ పుర ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 24









