E-PAPER

నూతన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, తెల్లం,పిఓ.రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతగుప్ప గ్రామంలో నూతన పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన (ఐటిడిఏ) పిఓ
బి రాహుల్ ఐఏఎస్, స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు,చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలం వెలిగించి, రిబ్బన్ కట్ చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు, విద్యార్థులతో ఓ పాట ఆలపించి పిఓ, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ,నేటి బాలల రేపటి పౌరులు క్రమశిక్షణతో పాటు చదువు విద్యన అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలవాలని పేర్కొన్నారు.డీఈవో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఆట వస్తువులు పంపిణీ చేశారు.విద్యార్థులతో కూర్చొని పిఓ ఎమ్మెల్యే స్థానిక అధికారులు భోజన కార్యక్రమం చేశారు.తదుపరి మండలంలోని పలు అభివృద్ధి పనుల గురించి గ్రామ ప్రజలను ఆదివాసి నాయకులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో, ఎంపీడీవో,ఇరిగేషన్ డిపార్ట్మెంట్,ఎమ్మార్వో, ఎంఈఓ, సెక్రటరీలు,పోలీస్ శాఖ, విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు,మార్కెట్ చైర్మన్,చర్ల సొసైటీ చైర్మన్,దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News