సహాయ కార్మిక అధికారి బిఎన్ రాజు.
మణుగూరు ,మే 29(వై 7 న్యూస్);
అసంఘటితరంగాల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ నందు నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక అధికారి మణుగూరు బిఎన్ రాజు తెలిపారు.ఏ సందర్బంగా అయన మాట్లాడుతూ …మణుగూరు, అశ్వాపురం, కరకగూడెం, పినపాక ,బూర్గంపహాడ్, పాల్వంచ మండలాల్లో పనిచేస్తున్న జొమాటో, స్విగ్గి, ఫ్లిప్కార్ట్, కొరియర్ బాయ్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్, టెక్నీషియన్స్, మీ షో వర్కర్స్, ఈకాం ఎక్స్ప్రెస్, అమెజాన్ మొదలగు సంస్థల్లో పని చేయు వర్కర్స్ అందరూ ఈ శ్రమ్ ఇన్సూరెన్స్ పథకంలో సభ్యత్వ నమోదు చేసుకోవాలని అన్నారు.పైన పేర్కొన్న రంగాలలో పనిచేస్తున్నా గిగ్ కార్మికులు తమ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్(సి ఎస్ సి ),మీసేవ సెంటర్లో తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ ,సెల్ నెంబర్తో సభ్యత్వ నమోదు చేసుకోనే విదంగా అట్టి సంస్థల యజమానులు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ పథకంలో చేరడానికి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు లోపు వారు అర్హులని సహాయ కార్మిక అధికారి తెలిపా









