మాల జన సమితి పినపాక నియోజకవర్గం అధ్యక్షులు చెట్టి సురేష్ ఆధ్వర్యంలో
అశ్వాపురం, నవంబర్ 22 వై 7 న్యూస్ తెలుగు
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా,అశ్వాపురం మండల మాల జన సమితి ఆధ్వర్యంలో ఝూల్కరి బాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఘాల్కరి భాయ్ నవంబర్ 22, 1830ల జన్మించారు .ఈమె భారతీయ మహిళా సైనికురాలు 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించింది లక్ష్మీబాయి సైన్యంలో మహిళా విభాగంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈమె దళిత బహుజన భూమి పుత్రిక గా ఘాల్కరి బాయికే లభించింది. అందుకే ఆమెను స్మరించుకుంటూ ఆమె జయంతి వేడుకలు మాల జన సమితి అశ్వాపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల జన సమితి పినపాక నియోజకవర్గం అధ్యక్షులు చెట్టి సురేష్, బత్తుల కిరణ్, మండల యూత్ అధ్యక్షుడు చెట్టి మనోజ్ కుమార్ సురేష్, దృవకుమార్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.









