E-PAPER

డిజిటల్ సర్వేలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం..!

నల్గొండ జిల్లా,అక్టోబర్05 వై 7 న్యూస్
రిపోర్టర్ నాగభూషణం

కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నల్గొండ మున్సిపల్ పరిధిలో 4వ వార్డు కేసరాజు పల్లి హ్యాపీ హోమ్స్ తనిఖీ చేశారు. మున్సిపాలిటీ లో నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ ఆధ్వర్యంలో కుటుంబ డిజిటల్ కార్డు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కేశరాజు పల్లి లోని కుటుంబాలు, గృహాలు వరకు సర్వే చేసిన కుటుంబాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్ డేటా ఆధారంగా సర్వే నిర్వహించాలని, సర్వేలో ఎట్టి పరిస్థితులలో ఏ ఇంటిని వదిలిపెట్టకూడదని, అలాగే ఏ కుటుంబాన్ని వదలరాదని అన్నారు. ఏరోజు డేటా ను ఆ రోజే నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఫోటోలు తారు మారు కాకుండా చూసుకోవాలన్నారు. అలాగే కుటుంబాల వివరాల సేకరణ సందర్భంగా కొత్త కుటుంబాల నమోదు, ఎవరైనా వివాహమై వెళ్ళిపోయిన వారి తొలగింపు వంటివి ఎంట్రీ చేయాలన్నారు. ఏ రోజు పని ఆరోజే పూర్తికాలని ,ఎట్టి పరిస్థితులలో నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. సర్వే బృందంలో ఎంపీడీవో, అధికారులు, సిబ్బంది
తదితరులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :