భద్రాద్రి శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఉదయం నుంచి భక్తులు కోలాహలంగా స్వామివారి దర్శనానికి బారులు తీరారు 9 గంటలకు అభిషేకము అనంతరము అష్టోత్తర సహస్రనామ పూజ జరిగింది భక్తులంతా కన్నుల విందుగా స్వామిని దర్శించుకుని ఆనందించారు సాయంత్రం ఐదు గంటలకు ఉట్లు కొట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి దామోదర్ ముఖ్య అతిథి గా పాల్గొని ఉట్లు కొట్టే ఉత్సవాన్ని ప్రారంభించారు.అనంతరం శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేయుట లాలలు జోలలు కార్యక్రమంలో మహిళలంతా లాలిపాటలతో స్వామిని ఉయ్యాల ఊపుతూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 87









