E-PAPER

Kriti Sanon: రాఖీ యాడ్‌పై తీవ్ర వివాదం.. విమర్శలతో ప్రకటన తొలగించిన జ్యువెలరీ బ్రాండ్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన తాజా రాఖీ పండుగ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. రక్షాబంధన్ సందర్భంగా ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ రూపొందించిన ఈ యాడ్‌లో కృతి సనన్ ధరించిన దుస్తులపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాఖీ పండుగకు సంబంధించిన ప్రకటనలో బికినీ తరహా దుస్తులు ధరించడం ఏంటంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఈ యాడ్‌లో కృతి సనన్ తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టినట్లు చూపించారు. అయితే పండుగకు సంబంధించిన ప్రకటనలో ఈ తరహా చిత్రీకరణ, ఆమె ధరించిన దుస్తులపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంప్రదాయ పండుగను ఇలా చూపించడం సరికాదంటూ పలువురు కామెంట్లు చేశారు. దీంతో ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో చర్చ తీవ్ర స్థాయికి చేరింది.

విమర్శలు ఎక్కువ కావడంతో సదరు జ్యువెలరీ బ్రాండ్ యాడ్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రకటనను ఎందుకు తొలగించారనే దానిపై సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడిందా అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కృతి సనన్ రాఖీ యాడ్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!