E-PAPER

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా జాగ్రత్త..! ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా ఆ తప్పు చేయరు

ప్రస్తుత డిజిటల్ యుగంలో సూది దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. సమయం కలిసిరావడంతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తుండటంతో జనాలు ఇ-కామర్స్ వెబ్‌సైట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే తరుణంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. పండుగలు, ప్రత్యేక సేల్స్ సమయంలో ఫేక్ వెబ్‌సైట్లతో వల విసురుతూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

ముఖ్యంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పేర్లను పోలిన నకిలీ లింకులను (Phishing Links) కేటుగాళ్లు సృష్టిస్తున్నారు. “రూ.99 లకే స్మార్ట్ వాచ్, కేవలం రూ.499 లకే బ్రాండెడ్ మొబైల్ ఫోన్” అంటూ వాట్సాప్, సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీటిని నిజమని నమ్మి లింక్స్ క్లిక్ చేసి, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు లేదా యూపీఐ పిన్ నమోదు చేయగానే క్షణాల్లో అకౌంట్లలోని డబ్బు మాయమవుతోంది. కేవలం ఆఫర్ల మోసాలే కాకుండా, పార్సిల్ డెలివరీ పేరుతో వచ్చే నకిలీ ఎస్ఎంఎస్‌లు, కస్టమర్ కేర్ నంబర్ల రూపంలో కూడా ఈ మోసాలు భారీగా జరుగుతున్నాయి.

ఈ తరహా సైబర్ వలలో పడకుండా ఉండాలంటే ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా వస్తువు కొనే ముందు సదరు వెబ్‌సైట్ యుఆర్ఎల్ (URL) చిరునామా సరిగ్గా ఉందో లేదో, అలాగే ‘https://’ మరియు లాక్ సింబల్ ఉన్నాయో లేదో పరిశీలించాలి. నమ్మశక్యం కాని ఆఫర్లను అస్సలు నమ్మకూడదు. వీలైనంత వరకు అధికారిక యాప్స్ ద్వారానే షాపింగ్ చేయడం, పేమెంట్స్ కోసం ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఇలాంటి భారీ సైబర్ మోసాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News