E-PAPER

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పలాస మున్సిపాలిటీ పరిధిలో నేడు ఉదయం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు పాల్గొన్నారు.
ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, కురిసిన వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన సచివాలయ సిబ్బందితో కలిసి పలు వార్డుల్లో తిరిగి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఇలాంటి సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు కూడా సమయానికి పెన్షన్లు అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News