మణుగూరు;
పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకున్న మహిళ
ముగ్గురు పిల్లలు అనాథలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం జీఎం ఆఫీస్ ఇప్పలసింగారం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక వివాహిత, గ్రామస్తుని వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా చాపల మార్కెట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను మానసికంగా వేధిస్తున్నాడని, ఆ వేధింపులే ఈ అఘాయిత్యానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Post Views: 121









