E-PAPER

మందస సీడీపీఓగా పెద్ధింటి అరుణ బాధ్యతలు స్వీకరణ

పలాస,ఆగస్టు 01 వై 7 న్యూస్;

మందస ఇంటిగ్రేటెడ్ బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారిగా పెద్ధింటి అరుణ శుక్రవారం నుంచి విధుల్లో చేరారు. గతంలో కొమరాడలో ఉపనిర్వాహకురాలిగా పనిచేసిన ఆమె పదోన్నతితో ఈ పదవికి వచ్చారు. మునుపటి అధికారిణి వసుంధరదేవి బదిలీపై వెళ్లగా, తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన రాధామాధవిని బాపట్లకు ప్రభుత్వం పంపింది. అధికారిణి లేకపోవడంతో కొంతకాలంగా వ్యవస్థ సక్రమంగా నడవలేదన్న ఆరోపణలు రావడంతో, అరుణ నియామకంతో పరిస్థితులు మెరుగవుతాయన్న ఆశ స్థానికుల్లో కనిపిస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్