మధ్యప్రదేశ్లోని భోజ్శాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భోజ్శాల ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న ముస్లిం పక్షం అభ్యర్థనకు కోర్టు అంగీకరించలేదు. అయితే, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ నిర్వహించేందుకు భోజ్శాల సమీపంలో ప్రత్యామ్నాయ బహిరంగ ప్రదేశాన్ని అందుబాటులో ఉంచాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైనదని పేర్కొంటూ హిందూ, ముస్లిం పక్షాలు శాంతి, సహనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ ఏడాది మేలో మధ్యప్రదేశ్ హైకోర్టు భోజ్శాల దేవాలయమేనని పేర్కొంటూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) శుక్రవారం నమాజ్కు ఇచ్చిన అనుమతిని కూడా రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజా విచారణలో సుప్రీంకోర్టు, కేసు తుది తీర్పు వచ్చే వరకు భోజ్శాల ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణాలు లేదా మార్పులు చేపట్టరాదని ఏఎస్ఐకి స్పష్టం చేసింది. అలాగే ఈ అంశంపై అవసరమైతే రోజువారీ విచారణ నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.









