E-PAPER

క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యం.. దుమ్ముగూడెంలో పిరామాల్ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమాలు

దుమ్ముగూడెం, జూలై 02 (వై 7 న్యూస్);

దుమ్ముగూడెం మండలంలో ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పిరామాల్ ఫౌండేషన్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామాల్లో ప్రజలకు క్షయవ్యాధి (టీబీ) గురించి అవగాహన కల్పిస్తూ, వ్యాధి ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు.

అలాగే, క్షయవ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయించేందుకు ప్రోత్సహిస్తూ, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, మందుల గురించి కూడా ప్రజలకు వివరిస్తూ ఆరోగ్యంపై చైతన్యం పెంచుతున్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల్లో క్షయవ్యాధిపై ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నిర్మూలనకు పిరామాల్ ఫౌండేషన్ బృందం కృషి చేస్తోంది.

రిపోర్టర్: దివ్య
దుమ్ముగూడెం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News