E-PAPER

పలాసలో ఏపీడబ్ల్యూజేయూ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


పలాస, వై7 న్యూస్: పలాస ప్రెస్ క్లబ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (APWJU) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) నాయకులు మహారాణ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పలాస ప్రాంతానికి చెందిన పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం యూనియన్ గత ఏడు దశాబ్దాలుగా చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.

అనంతరం పాత్రికేయుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలుకు సంబంధించి ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!