E-PAPER

మణుగూరులో ఘనంగా మహా గణపతి 24వ నవరాత్రి మహోత్సవాలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, సెప్టెంబర్ 14 (వై7 న్యూస్): మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా గణపతి 24వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మహోత్సవాల్లో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గణపతి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!