E-PAPER

ROB లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు కార్యక్రమం

పలాస, ఆగస్టు 20 (వై7 న్యూస్): పలాస నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులకు పట్టాలను అందజేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ROB నిర్మాణం మరియు అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు న్యాయం చేయడమే ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవ అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పలాస నియోజకవర్గం ముందుకు సాగుతోందని తెలిపారు.

పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే గౌతు శిరీషకు, సహకరించిన టీడీపీ నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ బడ్డ నాగరాజు, టౌన్ కార్యదర్శి సప్ప నవీన్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేష్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, క్లస్టర్ కన్వీనర్లు గాలి కృష్ణ, సవర రాంబాబు, వార్డు కౌన్సిలర్లు కోరికన శంకర్, డొక్కరి శంకర్, ROB లబ్ధిదారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!