E-PAPER

ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయిల్ సంచలన ఆరోపణలు

ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ నిఘా సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. నటాంజ్ సమీపంలోని పికాక్స్ పర్వతం (మౌంట్ కోలాంగ్) వద్ద ఉన్న లోతైన సొరంగాల్లో యురేనియాన్ని ఎన్‌రిచ్ చేసే వేలాది సెంట్రిఫ్యూజ్‌లను ఇరాన్ తరలించినట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. జూన్ 2025లో జరిగిన యుద్ధంలో ఇరాన్‌కు చెందిన మూడు అణు కేంద్రాలు దెబ్బతిన్న తర్వాత ఈ మార్పులు జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

పికాక్స్ పర్వత సముదాయం భూమి అడుగున 300 నుంచి 450 అడుగుల రాతి పొర కింద నిర్మించబడినట్లు సమాచారం. ఈ కేంద్రాన్ని వైమానిక దాడులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించినట్లు ఇజ్రాయిల్ నివేదిక పేర్కొంది. గత 15 నెలలుగా అక్కడ భారీగా ట్రక్కుల రాకపోకలు, సొరంగాల పటిష్టత పనులు జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కు కూడా ఈ ప్రదేశంలో ప్రవేశాన్ని ఇరాన్ కల్పించలేదని, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇరాన్ వద్ద సుమారు 454 కిలోల 60 శాతం ఎన్‌రిచ్ చేసిన యురేనియం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆయుధ తయారీకి అనువైన స్థాయికి చేరువలో ఉందని నిపుణులు భావిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News