E-PAPER

పలాస-కాశీబుగ్గలో SIR సమీక్షా సమావేశం

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో శుక్రవారం నిర్వహించిన SIR సమీక్షా సమావేశంలో ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు పాల్గొన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ నాయకులతో సమావేశమై కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.

ప్రతి బూత్‌లో సమన్వయంతో పనిచేసి SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ దరఖాస్తుల సేకరణను వేగవంతం చేయాలని, ఎదురయ్యే సమస్యలను వెంటనే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News