పలాస, జూలై 1 (వై7 న్యూస్): పలాస మండలంలోని పెద్దబొడ్డపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరికట్ల విఠల్రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.
ప్రతి నెలా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను ఇంటి వద్దకే చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.









