E-PAPER

గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మీట్ లో పాల్గొన్న ఎం డి.గౌస్ పాషా

మణుగూరు;

గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో మంగళవారం నిర్వహించిన స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు గ్రహీత ఎం.డి. గౌస్ పాషా పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా గౌస్ పాషా మాట్లాడుతూ, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమలోని ప్రతిభను వెలికితీసి వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను స్థాపించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని అన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆవిష్కరణలు మరియు పారిశ్రామిక రంగంలో యువత ముందుకు రావాల్సిన అవసరాన్ని వివరించారు.

స్టార్టప్‌ల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థికాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొని స్టార్టప్‌లు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తి కనబరిచారు.

ఈ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మీట్ యువతలో సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ విజయవంతంగా ముగిసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!