E-PAPER

మేమేం పాపం చేశాం..?

అత్యవసరాల్లో ఆసుపత్రి ప్రయాణం…

‘డోలిమోతల’దే ఆధారం

పులిపాటి పాపారావు జర్నలిస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలై 1 వై7 న్యూస్;
మొదటి శతాబ్దానికి చెందిన విధానాలే నేటి గిరిజనులకు తప్పనిసరి అవుతున్నాయి. ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకునే కాలంలోనూ, కరకగూడెం మండలంలోని అంగోరుగూడెం గ్రామ గిరిజనులు ప్రాణాలను చేతుల్లో పెట్టుకొని బురదమయ మార్గాల్లో డోలిమోతలపై ఆసుపత్రుల బాట పడుతున్నారు.

ఒక మహిళ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండగా, వర్షాల వల్ల మార్గమంతా బురదతో నిండిపోయి వాహనాల రాకపోకలకు పూర్తిగా అడ్డంకిగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారి వరకు డోలితో మోసుకెళ్లాల్సి వచ్చింది. ఇదంతా ఒక వైపు గుండెను కలిచివేసే దృశ్యం కాగా, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని కూడా కళ్లకు కట్టే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇది 1947 కాదు… ఇది 2025.
ఇది కేవలం వానాకాలంలో మట్టిబాటల మధ్య ప్రయాణం కాదు…
ఇది స్వతంత్ర భారతదేశపు 77 ఏళ్ల తరువాత కూడా గిరిజనులు డోలిమోతనే ఆసుపత్రికీ దారిగా ఉపయోగించాల్సిన దారుణ వాస్తవం.

కరకగూడెం మండలం అంగోరుగూడెంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన .ఇటీవల ఓ గిరిజన మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. వర్షంలో బురదమయమైన మార్గాల్లో వాహన రాకపోకలు అసాధ్యంగా మారడంతో, ఆమెను గ్రామస్తులు మూడు కిలోమీటర్ల మేర డోలిమోతలో మోసుకెళ్లారు. ఇది వినగానే పాత సినిమాల దృశ్యం గుర్తుకు వచ్చేదే కానీ… ఇది ప్రస్తుతం జరిగిన నిజం.

ఇది అడవిలో బతికే ఒక చిన్న గ్రామం కాదు, ఇది భారతదేశపు పౌరుడి ప్రాణయాత్ర.
77 ఏళ్ల స్వాతంత్రం వచ్చాక కూడా ఆసుపత్రి వరకూ వెళ్లే బాట లేకపోవడం అంటే… పాలకులకి ఇది నిజంగానే బాధకలిగించిందా?

పాలకులు ఎన్నికల సమయంలో మాటలు గుప్పించడానికే వస్తారు.
ప్రతిపక్షాలూ ప్రెస్ మీట్లతో పరిమితమై పోయారు.సంఘాలు, సంస్థలు, మానవహక్కుల పోరాటకారులు ఇవన్నీ గిరిజన గ్రామాల పిలుపుకు స్పందించకుండా నిశ్శబ్దంగా చూస్తున్న తత్వవేత్తలే.అదే సమాజం లోకాయుక్తపై కేసులు వేసే ఉద్యమాలకు రెచ్చిపోతుంది.కానీ ఓ గిరిజన తల్లిని డోలిమోతలో మోసుకెళ్లే దృశ్యాన్ని చూసినా ఒక్క ప్రశ్న వేయదు.

స్వాతంత్రం అన్ని వర్గాలకు సమానమా?
మిగతా దేశాలు 5G సాంకేతికతను ఆస్వాదిస్తుంటే, వనవాసుల కోసం 5 అడుగుల దారి కూడా వేయలేరా?
ఇప్పటికైనా మేలుకోని పాలక వ్యవస్థ… ఆ ఊరి ఇచ్చిన వాగ్ధానాలుగా మర్చిపోయిందా.గిరిజనుల జీవితాలను పోటీ రాజకీయాల వేదికగా మార్చడమే మిగిలింది.
అసలు మనం ఏ దేశంలో ఉన్నాం?
ఇది ప్రజాస్వామ్యమా? లేక అధికారుల చేతిలో అణచివేయబడుతున్న వనవాసుల శోకగాథా?
ఇలాంటి ఘటనలు పత్రికలలో చిన్న వార్తలుగా కనిపించకుండా… మన గుండెల్లో నిలవాలి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి గిరిజన గ్రామాలకు రోడ్లు, వైద్య సేవలు, వాహన సదుపాయాలను కల్పించకపోతే, “స్వాతంత్రం అందరికి” అనే నినాదం ఒక తప్పుడు వాగ్దానంగా మిగిలిపోతుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!