E-PAPER

ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం

కమలాపురం,సెప్టెంబర్18 వై 7 న్యూస్

కమలాపురం ఉన్నత పాఠశాల, గ్రామ పంచాయతీ లలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా కమలాపురం ప్రత్యేక అధికారి సురేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయినా సందర్భంను ఆనాటి పరిస్థితులను వివరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఉద్యోగి గా అవార్డు తీసుకున్న కమలాపురం పంచాయతీ కార్యదర్శి అరుణ్ ని జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగల రాకేష్ ,సిద్ధం శెట్టి లక్ష్మణ్ సి ఐ టి యు వెంకటేరెడ్డి, కాంగ్రెస్ ములుగు జిల్లా కార్యదర్శి భగవాన్ రెడ్డి ,గౌతమ్ కొంరెల్లి, జానవిజ్ఞాన వేదిక ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, జడ్ పి హెచ్ ఎస్ కమలాపురం ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్, కోరుకోప్పుల శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది సన్మానించారు.. అనంతరం స్వచ్చత సేవా కార్యక్రమం లో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సురేష్ పంచాయతీ సెక్రటరీ అరుణ్, జనవిజ్ఞాన వేదిక ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ,ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్ ,జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆరోగ్య కమిటీ కన్వినర్ మునిగల, రాకేష్ సి ఐ టి యు వెంకట్ రెడ్డి, సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భగవాన్ రెడ్డి, కోరుకోప్పుల శంకర్, కొమురల్లి గౌతమ్ సిబ్బంది పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News